రెండు లీటర్ల మంచి నీరు kadai పాత్రలో పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60 గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .
క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి ఆ కషాయాన్ని మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100 గ్రాములు కలిపి లేత పాకం వచ్చే వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో కలిగే అతి దాహం , అతి పైత్యం హరిన్చిపోతాయి .కాలేయానికి బలం కలుగుతుంది . ప్రాణానికి హాయిగా వుంటుంది .
శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి .
1 . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది ( లేక )
2 . కరక గింజలలో ని పప్పు , దోరగా వేయించి శొంటి పొడి సమంగా కలిపి తేనె తో మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి . పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా తగ్గిపొతయీ .