Monday, November 8, 2010

వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్




రెండు లీటర్ల  మంచి నీరు kadai  పాత్రలో  పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60  గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .  


క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి  , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి 
ఆ కషాయాన్ని  మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100  గ్రాములు  కలిపి లేత పాకం వచ్చే  వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .

ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా  మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో  కలిగే అతి  దాహం  , అతి పైత్యం హరిన్చిపోతాయి  .

కాలేయానికి బలం కలుగుతుంది  . ప్రాణానికి హాయిగా వుంటుంది .

ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం

ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .

సుగంధ పాల వెళ్ళ పొడి  , ధనియాల పొడి  , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి. 

ఒక గ్లాస్ మంచి నీటిలో  ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర  కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది  .


 

రక్తంలో వేడి - రక్త వీరేచనలు - వాంతులు


పండిన మేడి పండ్లను తేనె  తో  కలిపి తింటుంటే రక్తంలో వేడి , రక్త వీరేచనలు  , వాంతులు కట్టుకుంటాయి .



 

నిక్కకకు - నిక్కర్పైన యోగం



శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ  వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ  వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి  .


1  . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు  తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది  ( లేక ) 


2  . కరక గింజలలో ని  పప్పు , దోరగా వేయించి శొంటి  పొడి  సమంగా కలిపి తేనె తో  మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి . 
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో  వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా  తగ్గిపొతయీ .  

వడ దెబ్బ - తగిలితే






నీరుల్లిపాయల రసాన్ని  వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి. 



 


పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ  మెల్ల మెల్లగా కొద్ది  కొద్దిగ సేవింప చేయాలి .




చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా   బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా  మర్దన చేయాలి . 

అవకాశముంటే  మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి  లేపనం చేయాలి ..

ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.

వడ దెబ్బ తగలకుండా

ఒక గ్లాస్ మంచి నీటిలో 10  గ్రాముల చింతపండు వేసి నీటిలో కలిసిపోయేల  పిసికి వడ పోయాలి  . 


తరువాత అందులో ఒకటి లేదా రెండు చెంచాల చక్కర కలిపితే చక్కని పానీయం  సిద్దమవ్తుంది .


దీనిని  వేసవికాలంలో ప్రతి రోజు వుదయంపుట సేవిస్తూ వుంటే  వేసవి తాపాన్ని తట్టుకునే  శక్తీ పెరుగుతుంది . 



వేసవి నీరసానికి - విలువైన యోగం




 పచ్చి gorintakulu  5 గ్రాముల మోతాదుగా రాత్రి పుట పావు లిటరే మంచి నీటిలో వేసి నన బెటాలి  . ఉదయం పుట సుబ్రమైన చేతితో మెత్తగా పిసికి వడపోసి ఆ నీటిలో 50  గ్రాముల కండచేక్కర పొడి కలిపి తాగాలి .


ఇలా కనీసం 40  రోజుల పటు సేవిస్తే వేసవి నీరసం తగ్గట్టమే  కాకా  , రక్త సుద్ధి జరిగి , శరీరం ద్రుడవంతమవ్తుంది  .


ఇది వేసవి లో ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉపయోగపడుతుంది  .